Tuesday, June 6, 2017

21.పడుకునే విధానం గురించి ...మన ఆరోగ్యం

☘ మన ఆరోగ్యం.... మనచేతుల్లో ( 21 )

పడుకునే విధానం గురించి ......

     మనము భోజనం చేసిన తర్వాత ఆహారాన్ని పచనం చెయ్యటానికి జఠరాగ్ని ప్రదీప్తమవుతుంది. ఇందుకుగాను శరీరంలోని రక్తమంతా పొట్ట భాగానికి చేరుతుంది , మొదటిగా మెదడులోని రక్తం , తర్వాత ఇతర అవయవాల్లోని రక్తం. దీని వల్ల మెదడు విశ్రాంతిని కోరుకుంటుంది. కాబట్టి నిద్ర వస్తుంది , కనుక కొద్ది సేపు నిద్రపోవటం మంచిది. 30-- 40 నిమిషాలు మద్యాహ్న భోజనం తరువాత చాల అవసరం.

      సాయంత్రం ( రాత్రి ) భోజనం తర్వాత వెంటనే నిద్రపోకూడదు. కనీసం 2 గంటల తర్వాత నిద్రపోవాలి. వెంటనే నిద్రపోవటం వల్ల డయాబెటిస్ , హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదముంది.

      ఉదయం భోజనం తర్వాత , మధ్యాహ్న భోజనం తర్వాత విశ్రాంతి తీసుకునే అవకాశం లేకపోతే కనీసం 10 నిమిషాలు వజ్రాసనం వెయ్యండి.

      మనం భోజనం చేసే సమయంలో మన మనసు , చిత్తం పూర్తిగా ప్రశాంతంగా ఉండాలి. కనుక భోజనం చెయ్యడానికి ముందు శ్లోకాలు గాని , మంత్రాన్ని గాని చదివి కూర్చోండి.

      మనం ఏ సమయంలోనైన విశ్రాంతి తీసుకునేటప్పుడు మన తలని తూర్పు వైపు లేక దక్షిణం వైపున తల పెట్టి పడుకోవాలి.

      చదువుకునేందుకు , ఏదైనా అభ్యాసానికి ఉత్తర దిశ చాలా. మంచిది.

      పడుకోవటానికి ఉత్తర దిశ పనికిరాదు. దీనికి వైజ్ఞానిక పద్ధతి ఏమంటే మనిషి శరీరానికి ,భూమికి మధ్య గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. ఇది వికర్షణానికి గురి అవుతుంది. దీని వల్ల మనకి చాలా సమస్యలు వస్తాయి. ఎప్పుడు కూడా ఉత్తరం వైపు తల పెట్టి పడుకోకండి.

      పిల్లలు పొడుగు పెరగాలనుకుంటే వారిని దక్షిణం వైపు తల వుంచి పడుకోబెట్టండి. మూడు నాలుగు సంవత్సరాలలో మార్పు గమనించండి. వారు చక్కగా పొడుగు పెరుగుతారు.

   " ఆరోగ్యమే  మహాభాగ్యం "
               ... శ్రీ రాజీవ్ దీక్షిత్ ... 🙏

Collected and typed by: Ram Prasad Gaaru







Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong

Vishnu@Goseva world 

No comments: