Monday, June 5, 2017

5.శ్రీ వాగ్భటాచార్యుని రెండవ సూత్రం...మన ఆరోగ్యం

మన ఆరోగ్యం --- మనచేతుల్లో. ( 5)
      శ్రీ వాగ్భటాచార్యుని రెండవ సూత్రం. మనం తినడానికి తయారు చేసుకున్న ఏదైన అన్నం లేక పప్పు లేక రొట్టె ఇంకా ఏదైనా తయారు చేసిన 48 నిమిషాలలోపే తినడం జరుగవలెను. ఇది రెండవ సూత్రం. 48 నిమిషాల తర్వాత నుంచి గడిచేకొద్దీ పదార్ధంలోని పోషక విలువలు తగ్గిపోతూ వుంటాయి. పూర్తిగా పోషకాలు తగ్గిపోయిన ఆహారం ఎంత మంచిది కాదు.

      రొట్టెలాంటి వస్తువులు చేసేటప్పుడు గోధుమ పిండి అయితే 15 రోజుల లోపే పోషక విలువలు ఉంటాయి , జొన్న , సజ్జ , రాగి వంటి పిండిలో అయితే 7 రోజుల లోపే రొట్టెలుగా చేసుకోవలెను. అంతకు మించితే పిండి లో పోషక విలువలు తగ్గిపోతూ వుంటాయి.

      మన ప్రాచీన మహాఋషులు మనకందించిన ఒక అద్భుత పరికరం తిరగలి. నిజానికి తిరగలిలో పిండి చేసుకోవటం చాలా మంచిది. తిరగలిలో పిండి ఎప్పటికప్పుడు తాజాగా ఉంచటమేగాక , తిరుగలితో పిండి చేసేవారి శరీరం ఎంతో సౌకర్యవంతంగా , ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు, తిరగలి ఉపయేగించే మహిళలకు , మోకాలి నొప్పులు , నడుం నొప్పులు , భుజాల నొప్పులు, మెడ నొప్పులు ఉండవు. ఇంకా బ్లెడ్ ప్రెజర్ , డయాబెటిస్ వంటివి రానేరావు.

      తిరగలి ఉపయోగించేవారికి ఒత్తిడి పొట్ట మీద పడుతుంది. అక్కడ ఒత్తిడి ( గర్భ సంచి) పడటం వల్ల తల్లులు సుఖంగా బిడ్డను ప్రసవిస్తారు. సిజేరియను అవసరం ఉండదు. గర్భవతి అయిన స్రీలు 6, 7 నెలలు వచ్చేవరకూ తిరగలి ఉపయోగించ వచ్చును. స్తీలకైతే 43 సం!! తరువాత వచ్చే మోనోపాజ్ సమస్యల నుండి కూడా రక్షిస్తుంది.

      అధిక బరువు ఉండి బాధపడే వారు ఖచ్చితంగా ఒరువు తగ్గాలనుకుంటే కూడా తిరుగలి మీకు ఎంతో మేలు చేస్తుంది.( స్త్రీ లు , పురుషులు ఎవరైన సరే).

     "ఆరోగ్యమే --- మహాభాగ్యము "
         ... శ్రీ రాజీవ్ దీక్షిత్ ....


Collected and typed by: Ram Prasad Gaaru








Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong

Vishnu@Goseva world

No comments: