Monday, June 5, 2017

8.మన శారీరక దఃఖాలకి ప్రధాన కారణం కడుపు , పొట్ట భాగము.మన ఆరోగ్యం

‌‌🌸 మన ఆరోగ్యం --- మనచేతుల్లో. (8 ) 🌸
    💐 మన శారీరక దఃఖాలకి ప్రధాన కారణం కడుపు , పొట్ట భాగము. మనకు వచ్చే శారీరక దుఃఖాలలో 90% పొట్ట వల్ల వచ్చేవి. 10 % మిగిలిన అవయవాల వల్ల వచ్చేవి. అంటే మోకాళ్ళ వల్ల, భుజాలవల్ల , హృదయం వల్ల , మెదడు వల్ల ఇలాంటివి 10 % మాత్రమే , మిగిలిన 90 % రోగాలు పొట్ట వల్లే వస్తున్నవి.
  అన్ని రోగాలకి చికిత్స కంటే , రోగాల బారిన పడకుండా ఉండటమే ఎంతో ప్రధానం అంటారు వాగ్భటాచార్యుడు.
     మనం తిన్న ఆహారం పొట్టలో సక్రమంగా జీరణం అయిన తర్వాతనే , అది రసంగా మారి, మాంసం , మజ్జ , రక్తము , వీర్యము , మేద , మలం , మూత్రము ఇలా తయారవుతాయి. కాబట్టి తినడం ఎంత ప్రధానమో సక్రమంగా జీర్ణమవటం అంతే ప్రధానము.
     ☘ " భోజనాంతే విషం వారీ " , అంటే భోజనం చివర నీరు త్రాగడం విషంతో సమానము. మనం తీసుకున్న ఆహారం మొదట జీర్ణాశయానికి చేరుతుంది. అక్కడ అగ్ని ( జఠరాగ్ని ) ప్రదీప్తమవుతుంది. ఆ అగ్ని తిన్న ఆహారాన్ని పచనం చేస్తుంది. ఇది ప్రధానమైన విషయం.
     🌿 మనం నోట్లో మొదటి ముద్ద పెట్టుకోగానే లాలజలం ఊరుతుంది. వెంటనే ఆహారాన్ని పచనం చేయడానికి జఠరాగ్ని ప్రజ్వలిస్తుంది. ఇదే సమయంలో మనం గటగటా నీళ్లు తాగితే , ఆ నీరు జఠరాగ్నిని చల్లబరుస్తుంది. ఇక తిన్న భోజనం అరగదు , కుళ్ళి పోతుంది. ఆ కుళ్ళిన ఆహారం వలన విష వాయువులు పుట్టి 103 రోగాలకు కారణం అవుతుంది. మొట్ట మొదట గ్యాస్ ట్రబల్ , గొంతులోమంట , గుండెలో మంట , ఎసిడిటీ , అల్సర్ , పెప్టిక్ అల్సర్ మొదలగునవి. చివరగా వచ్చేది క్యాన్సర్. ఆహారం సక్రమంగా జీర్ణమైతే చెడు కొలెస్ట్రాల్ అసలు ఉండదు. కాబట్టి భోజనం చేసిన వెంటనే నీరు త్రాగకూడదు. 🌻

  🍁ఆరోగ్యమే .... మహాభాగ్యం 🍁
 ....... శ్రీ రాజీవ్ దీక్షత్......🙏


Collected and typed by: Ram Prasad Gaaru








Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong

Vishnu@Goseva world

No comments: